News

రాష్ట్రపతి పాలన ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు


లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన ప్రభుత్వాధికారుల నియామకాలు జరుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా నియామకాల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రిన్సిపల్  సెక్రటరీగా రాజేంద్ర కుమార్ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్ ఆదేశాలను నజీబ్ జంగ్ తిరస్కరిస్తూ లేఖ రాయడంతో ఆయన ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు.